- ఈ ప్రభుత్వం కొస వెళ్లదు
- గోదావరి జిల్లాలను తమిళనాడు కర్ణాటకకు తీసుకువెళ్లేందుకు మోడీ కుట్ర
- మాజీ ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ అధినేత కేసిఆర్
- వీణవంక లో గులాబీ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన కేసీఆర్
హుజురాబాద్, జనత న్యూస్:తెలంగాణ పరిస్థితిని చూస్తే దుఃఖం కలుగుతోందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొస వెళ్లదని, మళ్లీ బి ఆర్ ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ ముఖ్యమంత్రి బి.ఆర్.ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. శనివారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గం లోని వీణవంక మండల కేంద్రానికి చేరుకున్న కేసిఆర్ కు ప్రజలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. రాత్రి కౌశిక్ ఇంట్లో బసచేసిన కెసిఆర్.. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఆత్మీయ సమ్మేళన సభకు హాజరయ్యారు. ఈ సభకు బి.ఆర్.ఎస్.ఎం.పి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, జీవి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టాల్సిన ఐటి, ఇతర పరిశ్రమలు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, ఇటీవలే ఓ ఐటీ కంపెనీ చెన్నైకి తరలిపోయిందని, అల్యూమినియం ప్లాస్టిక్ పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని, రైతులకు రైతుబంధు అందడం లేదని, విద్యుత్తు కొరతలనుకుంటున్నాయని, రాష్ట్ర పరిస్థితిని చూస్తే దుఃఖం కలుగుతోందని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 9 ఏళ్ళు రైతులకు పరిశ్రమలకు గృహ అవసరాలకు సరిపోయినంత కరెంటు ఇచ్చామని, కానీ నాలుగు నెలల్లోనే ఏమైందని విద్యుత్ పోతను ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు. మిషన్ కాకతీయ ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని, ఎంజీఎం ఆసుపత్రిలో, ఆదిలాబాద్ రిమ్స్ లో రోగులకు సేవలు అందక ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నట్లు పత్రికల్లో వార్తలు చదివానని కెసిఆర్ అన్నారు.
తమ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేశామని, ఆడపిల్ల పుడితే రూ. 13000, మగ శిశువు పుడితే రూ. 12000 ఇచ్చామని, కెసిఆర్ కిట్లు అందజేశామని, తల్లిని శిశువును వాహనంలో తీసుకువచ్చి ప్రసవం చేసి తిరిగి ఇంటి వద్ద దింపామని, ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీని తమ ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీని తాము అరికట్టామని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడే దక్షత, ప్రజలను కాపాడాలనే తాపత్రయం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ గోదావరి, కృష్ణా జలాలను తమిళనాడు కర్ణాటకకు తీసుకుపోయే ప్రయత్నం అధికారికంగా చేస్తున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయమే స్పందించడం లేదని, ఇలాంటి చర్యలను వి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలన సమయంలో చేస్తే తాను గట్టిగా అడ్డుకున్నానని ఆయన అన్నారు. గోదావరి, కృష్ణ జలాలు వేరే రాష్ట్రాలకు తీసుకువెళ్తే తెలంగాణకు, రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు తనను సమావేశాలకు తెలిసిన తను వెళ్లలేదని, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పానని.. ఆయన వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో పార్లమెంటులో మనకు ఎంపీల బలం ఉంటే ఎగిరి మైకు అందుకొని కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందని.. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ ఎంపీలను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. బండి సంజయ్ మైకు దొరికితే తిట్ల పురాణాలు.. తంబాకు తినడం కోసం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. వినోద్ కుమార్ గెలిపిస్తే నిధుల కోసం పోరాడతారని అన్నారు.
రైతులను కోడి పిల్లల కాపాడుకున్నాం
నాడు తెలంగాణ బిల్లు ఆమోదం కోసం ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్లిన తాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెళుతున్నానని.. తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడతానని ప్రజల బలంతో, ఆత్మవిశ్వాసం, ధైర్యం తో చెప్పానని.. ప్రజలు దీవించారని.. అదే ప్రకారం అడుగుపెట్టానని మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడినాటికి కరెంటు ఉండేది కాదని, నీళ్లు ఉండేవి కాదని, తెలంగాణ రైతులు ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వలస వెళ్లే పరిస్థితి ఉండేదని, కొందరు రైతులు ఆటో డ్రైవర్లుగా మారారని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణను ఒక పొదరిల్లుల నిర్మాణం చేసుకున్నామని.. ఆసరా పింఛన్లను 200 నుండి వెయ్యికి 1000 నుండి 2000 పెంచుకున్నామని.. అశోక్ గులాటి, చరణ్ దాస్ వంటి మేధావులతో చర్చించి వ్యవసాయాన్ని ఇస్త్రీకరణ చేసేందుకు రైతుబంధు రైతు బీమా ధరణి వెబ్సైట్ తీసుకువచ్చామని, కాలువల ద్వారా ఏడాదికి 10 నెలల పాటు రైతులు ఇక చాలు అనేదాకా.. నీటి సరఫరా చేసామని, రైతులకు ఇబ్బంది కలగకుండా తేమ తరుగు లేకుండా.. చివరకు రైతులకు నష్టం జరగకుండా తడిసిన ధాన్యాన్ని కూడా 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోలు చేశామని ఆయన గుర్తు చేశారు. 55 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి మొదట రాష్ట్రంలో ఉండేదని.. దాన్ని 3.5 లక్షల టన్నులకు తీసుకువెళ్లామని.. వలస పోయిన రైతులు మళ్లీ రాష్ట్రానికి వచ్చి వ్యవసాయం చేసుకున్నారని, రైతుల ధైర్యం విశ్వాసం కల్పించామని అన్నారు.
హుజరాబాద్ లో దళిత బందును పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగేలా చేసామని, దీన్ని పొడిగించాలని ప్రయత్నం చేశామని కానీ తమ ప్రభుత్వం గెలవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని.. కాంగ్రెస్కు చేయి చాపారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. హుజురాబాద్ లో మాత్రం కౌశిక్ రెడ్డిని ప్రజలు గెలిపించారని, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రజల కోసం పనిచేస్తూ పోవాలని.. 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తన బస్సు యాత్రను కూడా అడ్డుకోవాలని కాంగ్రెస్ బిజెపిలో ప్రయత్నం చేశాయని కానీ తన యాత్రను ఎంత నిషేధిస్తే అంత ప్రజల నుండి ఉవ్వెత్తున స్పందన లభిస్తుందని, దీన్ని ఆ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. పొట్టొడి నెత్తిని పొడుగోది కొడితే, పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టిందని.. కెసిఆర్ తన యాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ బిజెపిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సభకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు, రైతులు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు.