హైదరాబాద్, జనత న్యూస్: హైదరాబాద్ సెంట్రలో యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పునస్సమీక్షించాలని వేముల రోహత్ తల్లి రాధిక శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం కావాలనే ఈ కేసు విచారణను తప్పుదోవ పట్టించి కేసు క్లోజ్ చేయించారని తెలిపింది. ఈ కేసు తిరిగి విచారణ చేసి న్యాయం చేయాలని ఆమె సీఎం ను కోరింది. అయితే ఈ విషయంపై న్యాయం జరిగే విధంగా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ ను కలిసిన వేముల రోహిత్ తల్లి..
- Advertisment -
