10Th Result 2024 Telangana :పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. హైదరాబాద్ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. కాసేపట్లోనే ఈ ఫలితాలు ఆన్ లైన్ లో కి రానున్నాయి. మొత్తం పలితాల్లో 91.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నాటికి ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించారు. మొత్తం 5,08,380 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో2, 57, 952 మంది బాలురు కాగా 2.50.433 మంది బాలికలు ఉన్నారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
https://bse.telangana.gov.in/
