కరీంనగర్,జనత న్యూస్: ఇంటర్మీడియట్ మొదటి,రెండవ సంవత్సరం ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత మార్కులు సాధించి బుధవారం ప్రభంజనం సృష్టించారు.జూనియర్ ఎంపీసీలో టీ. శృతి 468, సి.హెచ్. శ్రీహీత 468, వి. ప్రణవి 468, ఏ. శశిప్రీతమ్ 468, కె. వర్షీత్ 468, కె. రుత్విక్ 468, ఎస్. కార్తికేయ 468, కె.సృజల్ 468, టి. వర్షిత 468, యమ్. శ్రీవర్ష 468, పి.జి. ప్రియామృత 468, కె. వర్షిణి 468, ఇ.ప్రసన్న 468, యమ్. రుత్విక 468, జి. లక్ష్మీప్రసన్న 468. కె. అభిలాష్ 468 మార్కులతో 16 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు.మరో 65 మంది విద్యార్థులు 467 మార్కులు మరియు 117 మంది విద్యార్థులు 466 మార్కులు సాధించారు.జూనియర్ బీపీసీలో బీ. నిలీమ 438 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ స్థానంలో నిలిచారు. 8 మంది విద్యార్థులు 437 మార్కులు, 25 మంది విద్యార్థులు 436 మార్కులతో అత్యున్నత స్థానంలో నిలిచారు.

జూనియర్ ఎంఈసీలో టి. అఖిల్ 494 మార్కులతో రాష్ట్ర అగ్ర స్థానంలో నిలిచాడు. యమ్. సహస్రరెడ్డి 493 మార్కులు, వి. అక్షయ్్వర్థన్ 493 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్ C.E.C. విభాగంలో 500 మార్కులకు గాను ఎస్. సృష్టిత 492 మార్కులు సాధించగ బి. గ్రీష్మ 491 మార్కులు సాధించింది.సీనియర్ ఎంపీసీలో కె. కార్తికాబాబు 993 మార్కులు, టి. సాహిత్య 993 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థానంలో నిలిచారు. ఎల్. హర్షిత 992, బి.నిహారిక 992, యమ్. పల్లవి 991, డి.శివాంజలి 991, పి. విశ్వాణి 991, కె. మిశ్రా 991, ఎల్. అస్మిత 991, మారియామావిన్ 991, జి.ఉమాకాంత్ 991 మార్కులు సాధించారు.

ఇంతేకాక 20 మంది విద్యార్థులు 990 మరియు అపై మార్కులు సాధించడం విశేషం.సీనియర్ బీపీసీలో సీహెచ్. నిఖిల్ 990 మార్కులు, బి.అమిత 990 మార్కులు,ఏ.శ్రీనిది 990 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో విశిష్టస్థానంలో నిలిచారు.సీనియర్ ఎఈసీలో యమ్. వినమ్రత 974 మార్కులు, జి.మహేష్కుమార్ 974 మార్కులు సాధించారు.
For Full E paper clik here
Daily News E-Paper: Latest News and Insights from Telangana (janathadaily.in)

సీఈసీలో నిమ్రా అజ్మీ 978 మార్కులు యమ్. నజీర్ 972 మార్కులు సాధించారు.ఇంటర్ పలితాల్లో కళాశాలను రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలిపి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు.
