Thursday, July 3, 2025

జూనియర్ విద్యార్థులపై సీనియర్ల దాడి.. పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

రాయికల్, జనతా న్యూస్: మండలంలోని అల్లీపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దాడి చేసిన ఘటనలో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన నేపథ్యంలో గురుకుల పాఠశాలను కరీంనగర్ ఒరిజినల్ కోఆర్డినేటర్ గౌతమ్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని పలు రికార్డులను పరిశీలించి విద్యార్థుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు చేసిన ఘటనపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో గౌతమ్ మాట్లాడుతూ ఆరవ తరగతి విద్యార్థిపై ఏడవ తరగతి విద్యార్థి స్నేహపూర్వకంగా ఉండేవాడని కానీ బాత్రూంకు వెళ్లే సందర్భంలో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య జరిగిన ఘటనలో జూనియర్ విద్యార్థి గాయపడినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థి పాఠశాలలో ఉపాధ్యాయులకు తెలియజేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు.

ఉగాది సందర్భంగా సెలవు దినం కావున పాఠశాలలో ఉపాధ్యాయులు దశల వారిగా విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.విద్యార్థి గాయపడిన విషయం ఉపాధ్యాయులకు తెలుపకపోవడం వల్లే తల్లిదండ్రులు ఆగ్రహించారని ఆయన వివరించారు. కాగా ఈ ఘటనలో విద్యార్థిపై దాడి చేసినట్లు ఆరోపిస్తున్న విద్యార్థికి కౌన్సిలింగ్ నిర్వహించామని, పద్ధతి మార్చుకోకపోతే రానున్న అకాడమీకు సంవత్సరంలో వేరే పాఠశాలకు బదిలీ చేస్తామని ఆయన తెలిపారు. అలాగే పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని అలాగే సెలవు దినాలలోఒకరికి అదనంగా మరొక ఉపాధ్యాయుడు,అనగా ఇద్దరు విధులు నిర్వర్తించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందివ్వడంతో పాటు వైద్యులకు సంప్రదించాలని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page