తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో తుంబుర తీర్థ ముక్కోటి వేడుక అంగరంగ వైభవంగా సాగింది. 2024 మార్చి 24, 25 రెండు రోజులపాటు ఈ ఉత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 24 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుమలలోని తూర్పు కనుమల్లో అంతర్భాగంగా ఉన్న శేషాచలం అడవిలో కొలువైన తీర్థాల్లో తుంబురతీర్థం ఒకటి. దీనికి ఎంతో విశిష్టత ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలో తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పాప వినాశనం డ్యామ్ వద్ద భక్తులకు అల్పాహారం, అన్న ప్రసాదాలు అందించారు. ప్రాథమిక చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు.
వైభవంగా తుంబుర తీర్థ ముక్కోటి ఉత్సవం
- Advertisment -