సిద్ధిపేట, జనతా న్యూస్: సిద్దిపేట నుంచి సిరిసిల్లకు ఏర్పాటే చేసే రైల్వే లైన్ భూసేకరణ జిల్లాలోని చిన్నకోడూరు, నారాయణరావు పేట మండలాల్లో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ ప్రక్రియ ను వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రైల్వే ప్రాజెక్టు ముఖ్య అధికారులు, రెవెన్యూ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ చిన్నకోడూరు, నారాయణరావు పేట మండలాల్లో పెండింగ్ లో ఉన్న భూసేకరణను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలను సేకరించాలని ఆయా మండల తహసీల్దార్ లకు తెలిపారు. రైల్వే లైన్ మాత్రమే కాకుండా పెండింగ్ లో ఉన్న సర్వీస్ రోడ్ భూసేకరణ సైతం పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణను వేగంగా పూర్తి చేసి రైల్వే అధికారులకు అప్పగించాలని తెలిపారు.
ఈ సమావేశం లో ఆర్డిఓ పి. సదానందం, రైల్వే ప్రాజెక్టు చీప్ ఇంజినీర్ అమిత్ అగర్వాల్, డిప్యూటీ చీప్ ఇంజనీర్ సంతోష్ కుమార్ మరియు ఇతర అధికారులు అయా మండల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
రైల్వేలైన్ భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి: సిద్ధిపేట కలెక్టర్
- Advertisment -