కరీంనగర్, జనతా న్యూస్: లోకసభ ఎన్నికల దృష్ట్యా అక్రమంగా డబ్బు, మద్యం , ఇతర వస్తువులు రవాణా చేసే చర్యలు అడ్డుకట్ట వేసేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ఆదేశాల మేరకు కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ వన్ టౌన్ , టూ టౌన్ , త్రీ టౌన్ పరిధిల్లోని బస్ స్టాండ్ ఏరియా, కమాన్ చౌరస్తా , మంచిర్యాల చౌరస్తా, గీతాభవన్ చౌరస్తా తో పాటుగా పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీలతోపాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఎన్నికల నియమావళి ముగిసే వరకు వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల నియమావళి పాటించాలని , ఉల్లంఘించి పట్టుబడిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు.
- Advertisment -