జనతా న్యూస్, సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్ర కురుమ యువజన సంఘం యువత కోఆర్డినేటర్ గా సిద్దిపేట జిల్లాకు చెందిన బోడపట్ల తిరుపతి కురుమనునియమిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూముకుంట అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా బోడపట్ల తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కురుమ యువత కోఆర్డినేటర్ గా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కురుమల సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని, కురుమలు రాజ్యాధికారం దిశగా వెళ్లేలా యువతను ఏకం చేస్తూ పోరాడుతామని తెలియజేశారు. ఈ సందర్భంగా బోడపట్ల తిరుపతి ఎమ్మెల్సీ, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర కురుమ యువత కోఆర్డినేటర్ గా బోడపట్ల తిరుపతి కురుమ
- Advertisment -