లక్నో: పెళ్లికి వెళ్తున్న ఓ బస్సు విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో 10 మంది సజీవ దహనం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ సమీపంలో8 మార్దా పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై జరిగిన ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విద్యుత్ తీగలు 11,000 ఓల్టేజ్ ఉన్న హై టెన్షన్ విద్యుత్ తీగలు బస్సుకు తగలతడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 30 మంది ప్రయాణిస్తుండగా.. 10 మంది సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి కొందరిని రక్షించారు.
విద్యుత్ తీగలు తగిలి బస్సు దగ్ధం..10 మంది సజీవ దహనం..
- Advertisment -