పెద్దపల్లి, జనతా న్యూస్: పెద్దపల్లి జిల్లా ముత్తారం సింగిల్ విండో చైర్మన్ పై అవిశ్వాసానికి నోటీసులు అందించారు. గురువారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో సింగిల్ విండోకు చెందిన 9 మంది డైరెక్టర్లు సహకార సంఘం సబ్ రిజిస్టర్ రామ్మోహన్ కు నోటీసులు అందించారు. ముత్తారం సింగిల్ విండోలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఇందులో 9 మంది చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ పొతిరెడ్డి రమణా రెడ్డిలపై అవిశ్వాసాన్ని ప్రకటించారు. అవిశ్వాసానికి మద్దతుగా అల్లడి యాదగిరి రావు, గుజ్జ గోపాలరావు, ఏలువాక కొమురయ్య, కొంకటి మల్లన్న, మద్దెల వెంకటలక్ష్మీ, నాయిని పార్వతమ్మ, సముద్రాల వాణి, ముడుసు ఓదెలు, అల్లం గోవర్దన్ ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పూదారి సర్వేష్, మాజీ జడ్పీటీసీ లు చొప్పరి సదానందం, నాగినేని జగన్ మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, కాంగ్రెస్ నాయకులు గుజ్జ లింగారావు, రామగిరి మహేందర్, వెల్మరెడ్డి సంజీవరెడ్డి, నల్లాల శ్రీను, గాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం సింగిల్ విండో చైర్మన్ పై అవిశ్వాసం నోటీసులు
- Advertisment -