Saturday, March 14, 2026

అంబారాన్నంటిన శోభాయాత్ర

మానకొండూర్ నియోజకవర్గం, జనత న్యూస్:సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జైశ్రీరామ్, జైశ్రీరామ్ అని నినదిస్తూ ఉదయం ఏడు గంటల నుండి గ్రామ నడిబొడ్డులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం నుండి సాగిన శోభాయాత్ర కన్నుల పన్నుడువులా, అబ్బారాన్ని అంట్టింది అని చెప్పుకోవచ్చు . హనుమాన్ భక్త బృంద సభ్యులు ధరించిన ఏకరూప దుస్తులు పలువురిని ఆకట్టుకున్నాయి. గ్రామంలోని ప్రైవేట్,ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు,మహిళల కోలాటాలు, డిజె సౌండ్స్ మోతలతో. టపాసులు పేలుస్తూ సాగిన శోభాయాత్రలో ఉత్సాహంగా పలువురు భక్తులు పాల్గొన్నారు.బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు కోలాటం కొలలను ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అలనాడు అయోధ్య కు వెళ్లిన తొమ్మిది మంది కారసేవకులను ఘనంగా సన్మానం చేశారు. అనంతరం హనుమాన్ భక్త బృందం సభ్యులచే అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బెజ్జంకి ప్యాక్స్ చైర్మన్ వైస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు, రమేష్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డీ, గ్రామ సర్పంచ్ ద్యావనపెల్లి మంజుల, హనుమాన్ భక్తబృంద సభ్యులు పుర్మ సుధీర్, నారెడ్డి సుదర్శన్, చీపురిశెట్టి మోహన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ రెడ్డీ, ఐలైన శ్రీనివాస్ రెడ్డి, పుర్మ రాఘవరెడ్డి, బోనగం రాజేశం, వెల్ది సత్యం, అంజి, డాక్టర్ శ్రీనివాస్, రావుల నరసయ్య, లింగాల శ్రీనివాస్, దోనే అశోక్, సంఘ రవి, మచ్చ శేఖర్, ఎరవేల్లి రవీందర్, నర్సింగం, పుర్మ నారాయణ రెడ్డీ, మానాల రవి, డి.వీ.రావు,డీలర్ పెద్దన్న, పూసల కార్తీక్, మోహన్,శీలం సత్తయ్య, వెంకన్న, దొనే రామారావు తదితరులు పాల్గొన్నారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page