కరీంనగర్, జనత న్యూస్: కరీంనగర్ లోని భగత్ నగర్ కు చెందిన లక్ష్మీగణపతి కాలనీ అసోసియేషన్ కు చెందిన పలువురు సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కొన్ని కారణాల వల్ల తమ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నామని, ఇప్పటి నుంచి అసోసియేషన్ కు తమకు ఎలాంటి సంబంధం లేదని రాజీనామా చేసిన వారు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారిలో గౌరవ అధ్యక్షులు సీహెచ్ సంజీవ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్ బాలయ్య , ట్రెజరరీ ఆర్ శంకరయ్య, కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాస్, ఎం.సంపత్, కె. ప్రశాంత్, వి.సత్యనారాయణ, వి బాల్ రెడ్డి, టి పూర్ణ చందర్, ఎం. శివ, ఎ. రాజారెడ్డి, బి రమేష్, ఆర్ శంకర్ ఉన్నారు.
లక్షీగణపతి అసోసియేషన్ సభ్యుల రాజీనామా
- Advertisment -
