కరీంనగర్, జనతా న్యూస్: కరీంనగర్ పట్టణ ఆర్య వైశ్య మహిళ సంఘం అధ్యక్షురాలిగా రావికంటి భాగ్యలక్ష్మి నియామకం అయ్యారు. అలాగే పట్టణ ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా తణుకు సాయి కృష్ణ నియమిస్తూ శనివారం నియామక పత్రాలను అందజేశారు.ఈనియామక పత్రాలను ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, మాజీ జిల్లా అద్యక్షులు ఏ వి మల్లికార్జున్ , జిల్లా ప్రధాన కార్యదర్శి శివనాథుని శ్రీనివాస్ , వాసవి సేవాదల్ అద్యక్షులు రాచమల్ల ఆంజనేయులు , డివిజన్ చైర్మన్ కొమురవెల్లి వెంకటేశం అందజేశారు.వీరు ఈ పదవిలో రెండు సంవత్సరాలు కొనసాగుతారు..ఈ సందర్భంగా పట్టణ ఆర్య వైశ్య సంఘంకరీంనగర్ అధ్యక్షుడు నగునూరి రాజేందర్ మాట్లాడుతూ ఆర్య వైశ్యుల ఐక్యత కోసం ఆర్య వైశ్యుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ అభినందనలు తెలియజేశారు.

