Saturday, July 5, 2025

CM KCR : కోనాయిపల్లి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

CM KCR : సిద్ధిపేట, జనతా న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఈ ఆలయానికి చేరుకోగా మంత్రి హరీష్ రావు ఘన స్వాగతం పలిగకారు. అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతించారు. ఈ నెల 9న గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు.

kcr in konaipally Temple
kcr in konaipally Temple

అదేరోజుల బీఆర్ఎస్ ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. సిద్ధిపేట జిల్లాలోని కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయం కేసీఆర్ కు సెంటిమెంట్ గా నిలిచింది. ఏ ఎన్నికలు జరిగినా ఆయన మొదట ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. 1985లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ ఆలయంలో ముందుగా పూజలు నిర్వహించిన తరువాతే నామినేషన్ వేస్తారు. 2001లో టీఆర్ఎస్ పార్టీని ప్రకటించే ముందు కూడా ఈ ఆలయంలో పూజలు నిర్వహించారు. అయితే ఈసారి కేసీఆర్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సందర్భంగా మరోసారి తన గెలుపుకు సహకరించాలని స్వామివారిని వేడుకున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page