జిల్లా ఆసుపత్రులను మించి వైద్య సేవలు
అభినందించిన విప్, జిల్లా కలెక్టర్
వేములవాడ-జనత న్యూస్
సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలంటేనే నిరాసక్తత చూపుతారు ఎక్కువ మంది వైద్యులు. ఏదో వచ్చామా, సంతకం చేశామా, వెళ్లామా..? అన్నట్లుగా వ్యవరిస్తారు. ఇందుకు భిన్నంగా ఇక్కడి ప్రభుత్వ వైద్యులు..ఒకటి, కాదు రెండు కాదు..ఒకే రోజు 17 సర్జరీలు చేసి పేదల పట్ల తమ సేవ నిరతిని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 17 వివిధ రకాల సర్జరీలు చేసి అందరి మన్ననలు పొందారు. ఇందులో ఆరు డెలివరీలు, గర్భసంచి లోని కణతి తొలగింపు, మూడు సాధారణ, రెండు కంటి, 5ఆర్థో ఆపరేషన్లున్నాయి.
ఆసుపత్రి సూపెరిండెంట్, సీనియర్ సర్జన్ డాక్టర్ పెంచలయ్య, గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్య, డాక్టర్ రత్నమాల, ఆర్థో డాక్టర్ అనిల్, మత్తు వైద్య నిపుణులు రాజశ్రీ, డాక్టర్ తిరుపతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ రaూ అభినందించారు. వంద పడకల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు అందుతున్నాయని విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. పేదలు ఇక్కడి ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.