Saturday, July 5, 2025

రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయండి…

  • కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్…                                    జమ్మికుంట నవంబర్ 22:జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. జమ్మికుంటలో గురువారం జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుగు చెంది ఉన్నారని, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, రేవంత్ రెడ్డి బహిరంగ సభకు నియోజకవర్గం లోని ప్రజలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, టిపిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నాగ మధు యాదవ్ జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కసబోజుల వెంకన్న జమ్మికుంట మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాయిని రవి ఎండి సజ్జత్ గూడెపు సారంగపాణి ఎండి ఇమ్రాన్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page