హైదరాబాద్ :
హైదరాబాదులోని గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించగా.. మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలన, పారదర్శక పాలనతో సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. సోనియా గాంధీ కృషితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను అన్ని రంగాల్లో అగ్ర భాగాన ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ స్ఫూర్తితో నిరంతరం ప్రజా శ్రేయసే లక్ష్యంగా అవిశ్రాంతంగా పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని వెలిచాల రాజేందర్ రావు సూచించారు.
పజా పాలన దినోత్సవంలో వెలిచాల..
- Advertisment -