- -బీ ఆర్ఎస్ ఒకటో డివిజన్ ఇంచార్జి దాసరి సాగర్ పిలుపు
కరీంనగర్ టౌన్ ,జనతా న్యూస్: నేడు కరీంనగర్లో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకు తీగలగుట్టపల్లిలోని సరస్వతి నగర్, చంద్రపురి కాలనీ, బృందావన్ కాలనీ నుండి అధిక సంఖ్యలో మహిళలు పురుషులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని బీ ఆర్ఎస్ ఒకటో డివిజన్ ఇంచార్జ్ దాసరి సాగర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన గంగుల కమలాకర్ కు నాలుగవసారి పట్టం కట్టాలని , మళ్లీ తెలంగాణను రాబందుల చేతిలో పెట్టకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దాసరి వినోద్ బూత్ కమిటీ కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు
నేటి కరీంనగర్ బహిరంగ సభను విజయవంతం చేయండి
- Advertisment -