Israel : ఇజ్రాయిల్, అమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గాజా సరిహద్దుల్లో కరువు తాండవిస్తోంది. ఇక్కడి ప్రజలు తిండి గింజలు కరువై ప్రాణాలు నింపుకునేందుకు కలుపు మొక్కలు, ఆకులు, చివరికి గడ్డి కూడా తింటూ కాలం గడుపుతున్నారని మీడియా సంస్థ ఆల్ అజీర పేర్కొంది, గాజాలో లక్షల మంది ప్రజల ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తెలియజేసింది, దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇళ్ళను, జీవనోపాధిని కోల్పోయి చివరికి కడుపుని కూడా నింపుకోలేని పరిస్థితి చేరుకున్నారు. ఇజ్రాయిల్ దాడి ఇంకా కొనసాగుతున్నందున గాజాలోని పాలస్తీనియన్లు ఆకలితో అలమటిస్తున్నారని ఆల్బజీర కరస్పాండెంట్ తారిఖకు అజం తెలిపారు. దక్షిణ గాజాలోని తలదాచుకున్న ప్రజలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అందుతున్న నిత్యావసర సామాగ్రిపై ఆధారపడి కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. గాజాలో 1949 నుంచి సేవలు అందిస్తున్న నోబెల్ శాంతి బహుమతి పొందిన కేకే సంస్థకు చెందిన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీస్ కమిటీ జనరల్ సెక్రెటరీ మాట్లాడుతూ గాజాలో ఆకలి చావులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, గాజాలో ప్రజలంతా ఆఖరితో అలమటిస్తున్నారని ఇలాంటి విపత్తు ఎన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.
Israel : ఆహారం దొరకక..మొక్కలు, గడ్డి తింటున్నారు..
- Advertisment -