Thursday, September 19, 2024

అన్ని ప్రయత్నాలు చేసినా..అనుకూలించని వాతావరణం.. రాష్ట్ర మంత్రి పొంగులేటి భావోద్వేగం

జనత న్యూస్,హైదరాబాద్:
రాష్ట్రంలో తుఫాసు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ముందస్తు సహాయక చర్యలు చేపట్టినా, ప్రకృతి సహకరించని పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరిగింది. తన నియోజక వర్గంలో ఓ కుటుంబంలో ఇద్దరిని కాపాడ లేక పోయినందుకు కంట తడి పెట్టుకున్నారు రాష్ట్ర రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. పాలేరు రిజర్వాయర్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఇటుక తయారీ కార్మిక కుటుంబంలోని యాకూబ్‌, సైదా, వీరిద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుక పోవడం పట్ల మంత్రి పొంగులేటి భావోద్వేగం చెందారు. కుమారుడు షరీఫ్‌ను అతికష్టం మీద కాపాడినప్పటికీ, తల్లిదండ్రులను కాపాడ లేక పోయినందుకు ఆయన మదనపడ్డారు. మీడియాతో ఈ విషయాన్నిచెబుతూనే ఒకింత బాధాతప్తంతో ఆవేదన వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌ తీసుక వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, వాతావరణం అనుకూలించక పోవడంతో దురదృష్టం ఆ కుటుంబాన్ని వెంటాడిరది. సహాయం చేసే వారున్నా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకుంటే ఏం జరుగుతుందో ఈ సంఘటన ఓ ఉదాహరణ. వర్షాకాలంలో రిజర్వాయర్లు, జలాశయాలు, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటే..అలెర్ట్‌ ఉండాల్సిందే

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page